అనంతపురం : అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తము చెప్పినా రేషన్ డీలర్ ను మార్చలేదన్న కారణంతో గుడిబండ తహసీల్దార్ (ఎమ్మార్వో) పై టీడీపీ కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. ఆ దాడితో తీవ్రంగా గాయపడిన తహసీల్దార్ కోమాలోకి వెళ్లారు. దీంతో ఆయన్ని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
తహసీల్దార్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. అయితే టీడీపీ నేతల బెదిరింపులు భరించలేక ఇప్పటికే అయిదుగురు ఎమ్మార్వోలు దీర్ఘకాల సెలవుపై వెళ్లారు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
0 comments:
Post a Comment