వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Tuesday, February 2, 2016 | 2/02/2016


వెంకటరమణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కాకినాడ : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న కాపు ఉద్యమకారుడు వెంకట రమణమూర్తి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. కాకినాడ డైయిరీ ఫామ్ సమీపంలోని వెంకట రమణమూర్తి నివాసానికి వెళ్లిన ఆయన... కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అధైర్యపడొద్దని, వారి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ  అండగా ఉంటుందని  వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏ కష్టం ఎదురైనా తాము ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరూ భావోద్వేగాలకు లోనై ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్ జగన్ కోరారు.  ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. కాగా  శ్రీకాకుళం జిల్లాలో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా కాకినాడ చేరుకున్నారు.
Share this article :

0 comments: