
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని వైసీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజనులు, అక్కడి ఉద్యోగులు తీవ్ర ఆందోళన లో ఉన్నారని, శాసనసభ వేదికగా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. వారందరికీ తెలంగాణలోనే పునరావాసం కల్పించాలని కోరారు. ఏడుమండలాలు ఆంధ్రప్రదేశలో విలీనమయ్యాయనే సాకుతో బూర్గంపాడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని.. జెడ్పీటీసీకి అర్హత లేకుండా చేయటం అన్యాయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రస్తావిం చారు.
0 comments:
Post a Comment