టీడీపీకి సిగ్గురావడం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీకి సిగ్గురావడం లేదు

టీడీపీకి సిగ్గురావడం లేదు

Written By news on Tuesday, June 23, 2015 | 6/23/2015

ఒంగోలు: ఓటుకు నోటు వ్యవహారంలో పీఠం కదిలిపోతున్నా.... అధికార పార్టీ టీడీపీకి సిగ్గురావడం లేదని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలను నెల్లూరు తరలించడంపై మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు లో వైవీ సుబ్బారెడ్డి... టీడీపీ నేతలుపై మండిపడ్డారు. కుక్కతోక వంకరన్నట్లు టీడీపీ బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి అనుమానించినట్లే... తమ పార్టీ సభ్యులను ప్రలోభపెట్టి టీడీపీ క్యాంపునకు తరలించారని విమర్శించారు. నెల్లూరు లాడ్జీలో ప్రకాశం జిల్లాకు చెందిన తమ పార్టీ ఎంపీటీసీలను నిర్బంధించారన్నారు. టీడీపీ నీచ రాజకీయాలపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎలక్షన్ కమిషన్.... టీడీపీ నేతలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: