దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ జగన్

దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ జగన్

Written By news on Wednesday, October 7, 2015 | 10/07/2015


గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షా స్థలికి చేరుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 2గంటల ప్రాంతానికి అక్కడికి వచ్చారు. అంతకుముందు ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను తలపెట్టిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి 12 గంటల ప్రాంతంలో విజయవాడకు చేరుకున్నారు. వెంటనే, కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనం అనంతరం గుంటూరు దీక్షా స్థలికి బయలుదేరి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో చేరుకున్నారు.
Share this article :

0 comments: