ఒంటిగంటకు జైట్లీతో వైఎస్ జగన్ బృందం భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒంటిగంటకు జైట్లీతో వైఎస్ జగన్ బృందం భేటీ

ఒంటిగంటకు జైట్లీతో వైఎస్ జగన్ బృందం భేటీ

Written By news on Friday, July 11, 2014 | 7/11/2014

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఆయనతో పాటు పార్టీనేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా జైట్లీని కోరనున్నారు.

అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లను వైఎస్ జగన్ బృందం కలుసుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు, సమస్యలపై వారికి వినతిపత్రం సమర్పించటంతో పాటుగా కొత్త రాష్ట్రం పురోభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలందించాలని కోరతారు.
Share this article :

0 comments: