త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల యాత్ర: పొంగులేటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల యాత్ర: పొంగులేటి

త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల యాత్ర: పొంగులేటి

Written By news on Monday, November 17, 2014 | 11/17/2014


త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల యాత్ర: పొంగులేటి
మహబూబ్ నగర్: త్వరలో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లాలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని పొంగులేటి వెల్లడించారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందని ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, శివకుమార్, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు సభ నివాళులర్పించింది. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో చాలా అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వైఎస్సార్ ప్రారంభించారని.. తర్వాత ఏ నాయకుడికీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచన కూడా లేదని విమర్శించారు. తగిన విద్యుత్ లేక పంటలు దెబ్బతిన్నాయన్నారు.
 
రైతులకు పరిహారం అందుంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని పొంగులేటి తెలిపారు. ఆత్మహత్యల చేసుకున్న రైతులను తిరిగి బతికించగలుగుతామా?అని ప్రశ్నించారు. ఎండిన ప్రతి ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు. తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని.. ప్రజల కష్టాలపై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నట్లు పొంగులేటి తెలిపారు.
Share this article :

0 comments: