చంద్రబాబు అబద్ధాలతో రైతులకు కష్టాలు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు అబద్ధాలతో రైతులకు కష్టాలు: వైఎస్ జగన్

చంద్రబాబు అబద్ధాలతో రైతులకు కష్టాలు: వైఎస్ జగన్

Written By news on Wednesday, May 27, 2015 | 5/27/2015


చంద్రబాబు అబద్ధాలతో రైతులకు కష్టాలు: వైఎస్ జగన్
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆడుతున్న అబద్ధాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు బూటకపు వాగ్దానాలతో రైతులు దారుణంగా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రైతులు ఆశలు వదులుకోక ముందే వారి తరపున పోరాడతామని ట్విటర్ లో పేర్కొన్నారు. రైతుతో తాను మాట్లాడుతున్న ఫోటోను వైఎస్ జగన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.

'అనంతపురం జిల్లాలో నెలకొన్న క్షేత్రస్థాయి వాస్తవాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. చంద్రబాబునాయుడు చెప్పిన అబద్ధాలు.. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ వర్గాల గొంతుకగా నిలవడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది' అని అంతకుముందు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Share this article :

0 comments: