- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అసెంబ్లీలో ఇటీవల వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు ఆధారాలతో సమస్యను లేవనెత్తారని తెలిపారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే, వారికి భరోసా కల్పించేందుకు తానే స్వయంగా వె ళ్లి పరామర్శిస్తానని జగన్ ప్రకటించినట్టు పేర్కొన్నారు.
ఆ పరిణామంతో దిగొచ్చిన చంద్రబాబు.. రైతు ఆత్మహత్యలను ఒప్పుకున్నారన్నారు. తమ పార్టీ ఒత్తిడితోనే జిల్లాలో 29 మంది రైతు, 11 మంది చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటి వరకు 86 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని, వారి జాబితాను అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్కు అందజేశామని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.
0 comments:
Post a Comment