ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది

Written By news on Saturday, February 21, 2015 | 2/21/2015


'ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది'
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మాట మార్చుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వెంకయ్యనాయుడు కూడా ప్రస్తుతం రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులోనూ, పార్లమెంటు బయట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తోందని ఆయన అన్నారు.

కేంద్రంలో మంత్రి పదవులను కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ బీజేపీ తో కుమ్మక్కైందని ఎద్దేవాచేశారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడటానికి చంద్రబాబు భయపడుతున్నారని సుబ్బారెడ్డి అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో నిర్మిస్తామని గత ఎన్నికల్లో మోదీ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో సీఆర్డీఏ చట్టంలోని అవకతవకలపై ప్రస్తావిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
Share this article :

0 comments: