అనంతపురం: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలే లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుకాయిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు తలశిల రఘురాం, శంకర్ నారాయణ ఆరోపించారు. శనివారం అనంతపురంలో జరిగిన పార్టీ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ...చంద్రబాబు ప్రభుత్వం మండిపడ్డారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసిన తరువాతే రైతు ఆత్మహత్యలను చంద్రబాబు అంగీకరించారన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సాధించిన నైతిక విజయమన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర గురించి ప్రస్తావిస్తూ...రైతన్నకు ధైర్యం కల్పించేందుకే జగన్ మోహన్ రెడ్డి యాత్రకు పూనుకున్నారని తెలిపారు.
Home »
» రైతన్నకు ధైర్యం కల్పించడానికే రైతు భరోసా యాత్ర
రైతన్నకు ధైర్యం కల్పించడానికే రైతు భరోసా యాత్ర
Written By news on Saturday, February 21, 2015 | 2/21/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment