సర్కారు నైజం బట్టబయలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారు నైజం బట్టబయలు

సర్కారు నైజం బట్టబయలు

Written By news on Tuesday, April 21, 2015 | 4/21/2015


సర్కారు నైజం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన శివరామకృష్ణన్ తాజాగా వెల్లడించిన అంశాలు చంద్రబాబునాయుడు ప్రభుత్వ నైజాన్ని బట్టబయలు చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వ ఆలోచనా తీరును శివరామకృష్ణన్ ఎండగట్టారని చెప్పారు.

ఒక ఆంగ్ల పత్రికలో శివరామకృష్ణన్ రాసిన కథనాన్ని ఆయన ఉటంకిస్తూ.. చంద్రబాబు సర్కారు ఆలోచన తీరును వాస్తవాలతో బట్టబయలు చేశారని తెలిపారు. ఆ కథనం ప్రభుత్వం, ముఖ్యమంత్రి బట్టలు ఊడతీసిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోను, బయట ఇన్నాళ్లు చెబుతున్న విషయాలను శివరామకృష్ణన్ తన కథనంలో పేర్కొన్నారని చెప్పారు.
నిధులిచ్చారనే నారాయణకు  ప్రాధాన్యత
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులు సమకూర్చారన్న కారణంతోనే మంత్రి నారాయణకు రాజధాని నిర్మాణంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారని సీతారాం ఆరోపించారు.
Share this article :

0 comments: