ఆయన ఇంకా ఏమన్నారంటే
- అబద్దాల కోరు, మోసాలు చేసిన వ్యక్తితో ఇవాళ మనం పోరాటం చేస్తున్నాం
- సామాన్యుల దగ్గరికి వెళ్లి పాలన గురించి అడిగితే చంద్రబాబు మోసం చేశాడన్నా అంటూ సమాధానం వస్తోంది
- మా రుణాలన్నీ బేషరుతుగా మాఫీ చేస్తానని మోసం చేశాడన్నా అంటూ అన్నదాతలు వాపోతున్నారు
- డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడితే.. చంద్రబాబు మమ్మల్ని నట్టేట ముంచేశాడన్నా అంటున్నారు
- నిరుద్యోగులను అడిగితే జాబ్ ఇవ్వలేకపోతే రూ. 2 వేలు భృతి ఇస్తానని దమ్మిడి కూడా ఇవ్వలేదన్నా అంటున్నారు
- అవ్వతాతలను అడిగితే జన్మభూమి కమిటీలు వేసి పెన్షన్లు ఎలా ఊడబెరకాలా అని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడని చెబుతున్నారు
- ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టిచ్చిన పాపాన పోలేదని అక్కాచెల్లెమ్మలు అంటున్నారు
- ఇంతకుముందు నెల కరెంట్ బిల్ రూ. 200 వస్తే ఇప్పుడు రూ. 600 వస్తోంది
- రుణాలన్నీ మాఫీ చేసేస్తానని రైతుల నోట్లో మట్టి కొట్టాడు
- రబీ మొదలైనా ఇప్పటివరకు నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది
- దేవుడు కూడా చంద్రబాబుకు మొట్టికాయ వేస్తాడు
- కమీషన్లు, లంచాల కోసం పట్టిసీమ ప్రాజెక్టు కట్టాడు
- ప్రతి అడుగులోనూ, ప్రతి విషయంలోనూ కరెప్షన్
- ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి
- పార్టీని బలోపేతం చేసేందుకు ముత్తా గోపాల కృష్ణ, శశిధర్, కన్నబాబులను చేర్చుకున్నాం
- కన్నబాబు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకుంటాడు
- ముత్తా శశిధర్ కు కాకినాడ టౌన్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తున్నా
- వీరిద్దరూ కూడా వైఎస్సార్ సీపీ కుటుంబంలో సభ్యులు, రాబోయే రోజుల్లో వారిద్దరికీ మంచి చేస్తాను
- నాపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తున్న జిల్లా ప్రజలకు రుణపడివున్నా
0 comments:
Post a Comment