చంద్రబాబు విభజన లేఖ గురించి మాట్లాడరే..: పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు విభజన లేఖ గురించి మాట్లాడరే..: పద్మ

చంద్రబాబు విభజన లేఖ గురించి మాట్లాడరే..: పద్మ

Written By news on Sunday, December 29, 2013 | 12/29/2013

చంద్రబాబు విభజన లేఖ గురించి మాట్లాడరే..: పద్మ
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తిరుపతి ప్రజాగర్జన సభలో చంద్రబాబు విభజన లేఖను వెనక్కు తీసుకుంటామని చెప్పకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. చంద్రబాబు గతంలో విభజన లేఖ ఇచ్చి తెలుగు ప్రజలు విడిపోవాలని  కోరుకున్నారని చెప్పారు.

ఎన్టీఆర్ పాలన గురించి మాట్లాడిన చంద్రబాబు.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి పనిచేసిన ఆయన తన పాలన గురించి మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కూడా నష్టపోకుండా ఉండాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పద్మ చెప్పారు. చంద్రబాబు తెలుగు ప్రజల్ని రెండు కోతులుగా చెప్పడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని గతంలో మతతత్వవాదిగా అభివర్ణించిన చంద్రబాబు నేడు అధికారం కోసం మోడీని ప్రశంసిస్తున్నారన్నారు. చంద్రబాబు సమైక్యాంధ్ర గురించి కాకుండా ఓట్లు వేయాల్సిందిగా ప్రాధేయపడుతున్నారని ఆరోపించారు.
Share this article :

0 comments: