బాబు అండతోనే కేంద్రం విభజన చేస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు అండతోనే కేంద్రం విభజన చేస్తోంది

బాబు అండతోనే కేంద్రం విభజన చేస్తోంది

Written By news on Friday, January 3, 2014 | 1/03/2014

బాబు అండతోనే కేంద్రం విభజన చేస్తోందివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : శాసనసభలో సమైక్య తీర్మానమే లక్ష్యంగా తాము పని చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తక్షణమే సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లి మీడియా పాయింట్ వద్ద భూమన మాట్లాడుతూ... విభజనతో రెండు ప్రాంతాలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు కోసమే విభజిస్తున్నారని ఆరోపించారు.
 
రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. విభజనతో ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నదీ జలాలు విషయంలో తీవ్ర సమస్యలు ఏర్పడతాయన్నారు. దీని వల్ల సీమాంధ్రలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అండ చూసుకుని కేంద్ర ప్రభుత్వం విభజనకు దిగిందని ఆయన వెల్లడించారు.
Share this article :

0 comments: