ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ దిశగా మార్చ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఆయనను అరెస్టు చేసినట్లు తెలిసింది. అయితే దీనికి నిరసనగా ఆయన పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. తర్వాత వైఎస్ జగన్ను పోలీసులు తమ వాహనంలోకి బలవంతంగా ఎక్కించి అక్కడినుంచి తీసుకెళ్లారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తదితరులను కూడా తీసుకెళ్లారు. అరెస్టు చేసేందుకు కొద్ది ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. మరింతమంది అమాయకులు ఇబ్బంది పడకూడదని, పోలీసుల లాఠీచార్జిలో దెబ్బలు తినకూడదనే ఉద్దేశంతోనే తాను అరెస్టు అవుతున్నానన్నారు.
''ఏపీ నుంచి వచ్చిన 3వేల మంది, ఢిల్లీలో మన రాష్ట్రానికి సంబంధించిన సానుభూతిపరులు అందరూ కలిసి 5 వేల మంది పార్లమెంటుకు మార్చ్ చేస్తామంటే.. కుదరదని పోలీసులు అడ్డుకుంటున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు.. మిమ్మల్ని అరెస్టు చేయక తప్పదని అంటున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే తలదించుకోవాలి. ఇంతమంది అమాయకులకు దెబ్బలు తగలడం బాధాకరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకోడానికి కూడా బాధపడుతున్నాం'' అని ఆయన అన్నారు.
''ఏపీ నుంచి వచ్చిన 3వేల మంది, ఢిల్లీలో మన రాష్ట్రానికి సంబంధించిన సానుభూతిపరులు అందరూ కలిసి 5 వేల మంది పార్లమెంటుకు మార్చ్ చేస్తామంటే.. కుదరదని పోలీసులు అడ్డుకుంటున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు.. మిమ్మల్ని అరెస్టు చేయక తప్పదని అంటున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే తలదించుకోవాలి. ఇంతమంది అమాయకులకు దెబ్బలు తగలడం బాధాకరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకోడానికి కూడా బాధపడుతున్నాం'' అని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment