కువైట్, ఖతార్‌లో వైఎస్‌కు ఘననివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కువైట్, ఖతార్‌లో వైఎస్‌కు ఘననివాళి

కువైట్, ఖతార్‌లో వైఎస్‌కు ఘననివాళి

Written By news on Wednesday, September 5, 2012 | 9/05/2012


అంతర్వేది (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డికి కువైట్, ఖతార్‌లలోని ప్రవాసాంధ్రులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ మూడో వర్ధంతి సందర్భంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు ఖతార్ రాజధాని దోహాలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించా రు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని దోహాలో నిర్వహించిన వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దోహా వైఎస్సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ప్రకాశబాబు, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

మరోవైపు, కువైట్‌లోని జబ్రియాలో తూర్పు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ అందించిన సువర్ణపాలన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అనంతరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ వివరాలను వైఎస్సార్ యువసేన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కువైట్ కన్వీనర్ దేవ వినోద్, ఖతార్ నుంచి దోహా వైఎస్సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు రాపాక శేఖర్ మంగళవారం ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.
Share this article :

0 comments: