హైదరాబాద్: నల్గొండ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అప్రజాస్వామికంగా పోలీసులు అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు మావన హక్కుల సంఘం(హెచ్ ఆర్ సి)కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హెచ్ ఆర్ సి జరిగిన సంఘటనపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.
వరద బాధితులను పరామర్శించేందుకు నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన విజయమ్మను గత నెల 31న పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఖమ్మం-నల్గొండ జిల్లాల సరిహద్దుల్లోని పైనంపల్లి వద్ద పోలీసులు ఆమెను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అందుకు ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వరద బాధితులను పరామర్శించేందుకు నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన విజయమ్మను గత నెల 31న పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఖమ్మం-నల్గొండ జిల్లాల సరిహద్దుల్లోని పైనంపల్లి వద్ద పోలీసులు ఆమెను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అందుకు ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment