ఆంధ్ర ప్రజలను అవమానిస్తున్న కేంద్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆంధ్ర ప్రజలను అవమానిస్తున్న కేంద్రం

ఆంధ్ర ప్రజలను అవమానిస్తున్న కేంద్రం

Written By news on Friday, November 8, 2013 | 11/08/2013

 https://www.facebook.com/ysrcpofficial
ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానిస్తోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ప్రారంభమై నేటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అన్నట్లు గురువారం నాడు కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) సమావేశం నిర్వహించి, రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలని, ఏయే అంశాలపై దృష్టి సారించాలని చర్చించడం ఏమిటని నిలదీసింది. విభజనకు అన్ని విధాలా సహకరిస్తూ‌ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, లేఖ ఇచ్చి వెనక్కి తీసుకోని చంద్రబాబు మద్దతు కారణంగానే కేంద్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా దూకుడుగా ముందుకు వెళుతోందని దుయ్యబట్టింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

 సీమాంధ్ర ప్రజలు, విద్యార్థులు, కుల సంఘాల వారందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యమిస్తున్నారని శోభా నాగిరెడ్డి తెలిపారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమాన్ని తలపిస్తోందని ఆమె అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆమె నిప్పులు చెరిగారు. ఉద్యమాలను గుర్తించే పరిస్థితి లేని అహంకారంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి గురించి గాని, మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గాని పట్టించుకోకుండా రాయల తెలంగాణను తెర మీదికి తీసుకువస్తున్న వారిని శోభా నాగిరెడ్డి తూర్పారపట్టారు. 

కేవలం సొంత రాజకీయ లబ్ధి కోసమే విభజనను కేంద్రం వేగంగా ముందుకు తీసుకువెళుతోందని ఆరోపించారు. కర్నూలు, అనంతపురంలను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించే హక్కు జేసీ దివాకరరెడ్డి, టీజీ వెంకటేష్‌, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన మరికొందరు, ఎఐఎం ఒవైసీకి గాని ఎవరిచ్చారని ప్రశ్నించారు. మొత్తం అన్ని జిల్లాలను కలిపి తెలంగాణ అని పేరుపెట్టి సమైక్యంగా ఉంచాలని ఎందుకు డిమాండ్‌ చేయలేకపోతున్నారని నిలదీశారు. రాయలసీమలో గెలిచే అవకాశం లేని వారు రాయల తెలంగాణ అంశాన్ని తెస్తున్నారని విమర్శించారు.

 జగన్మోహన్‌రెడ్డి అనే ఒకే ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి రకరకాల డిమాండ్లను తెస్తున్నారన్నారు. ఒక సమస్యను పరిష్కరించమని కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే.. రాష్ట్రంలో రకరకాల సమస్యలు తీసుకువస్తున్నదని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ప్రాంతాలు, జిల్లాల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి, అభద్రత కల్పించిందన్నారు. దివాకరరెడ్డికి గారి మరెవ్వరికైనా గాని రాయలసీమను విభజించమని అడిగే హక్కు లేదన్నారు. సొంత ప్రయోజనాల కోసం ఒక ప్రాంతం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆమె అన్నారు
Share this article :

0 comments: