ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

Written By news on Tuesday, August 12, 2014 | 8/12/2014


'ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'
కడప: రాష్టానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులను రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏ మేరకు ఖర్చు చేస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రఘురామ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని ఎంపిక విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రాయలసీమకు జరగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అంతకుముందు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ ఇప్పటివరకు నెరవేర్చలేదని తెలిపారు.
Share this article :

0 comments: