తక్కువ సమయం ఇవ్వటం అప్రజాస్వామికం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తక్కువ సమయం ఇవ్వటం అప్రజాస్వామికం

తక్కువ సమయం ఇవ్వటం అప్రజాస్వామికం

Written By news on Tuesday, August 26, 2014 | 8/26/2014

కీలకమైన బడ్జెట్‌పై మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్షానికి చాలా తక్కువ సమయం ఇచ్చారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు. ఇది చాలా అన్యాయమని.. అప్రజాస్వామికమని ఆయన ఆక్షేపించారు. నిన్నటి తమ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారని గుర్తు చేశారు. అయినా సమయం కేటాయించేందుకు తిరస్కరించిన స్పీకర్.. ముందుగా అనుకున్న మేరకే సమయం ఇచ్చామని చెప్పారు.
కాగా సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ.. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు.. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లో కూర్చుని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారపక్షం ఎదురుదాడి మొదలు పెట్టింది. సభ ఏ ఒక్కరి సొత్తు కాదని.. ఇష్టానుసారం నడపడానికి కాదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
Share this article :

0 comments: