Written By news on Tuesday, September 16, 2014 | 9/16/2014
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 18, 19 తేదీల్లో అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. జిల్లా పార్టీ ముఖ్య నేతలతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ చర్చిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి(ప్రోటోకాల్) తలశిల రఘురామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
0 comments:
Post a Comment