
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆస్తుల ప్రకటన ప్రజలను వంచించే విధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటించి ఆస్తుల ప్రకటన కాదని.. అక్రమ ఆస్తుల ప్రకటన అని వ్యాఖ్యానించారు.
హెరిటేజ్ కంపెనీలో వందల కోట్ల ఆస్తులు, బాలాయపల్లి భూములు, హైటెక్ సిటీ పరిసరాల్లో ఫామ్ హౌజ్, తనయుడు లోకేశ్ పేరు మీద ఇల్లు, ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు, సంపద, నగలు, నగదు రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సాధించారంటే ఆశ్యర్యమేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ ఈ స్థాయిలో సంపాదించారంటే గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాల్సిన అవసరముందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
0 comments:
Post a Comment