స్ఠిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్ఠిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి: జగన్

స్ఠిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి: జగన్

Written By news on Friday, November 11, 2011 | 11/11/2011

కడప(వైఎస్ఆర్ జిల్లా): కరువు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు 4 వేల రూపాయల చొప్పున ఇన్ పుట్ సబ్జిడి ఇవ్వడంతోపాటు మూడు వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని కరువు మండలాలో ఈరోజు ఆయన పర్యటించారు. దెబ్బతిన్న పంట పోలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఆయనకు చెప్పుకున్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క వ్యక్తి వల్ల కరువు వస్తుందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డ నిరూపించారన్నారు. ఉప ఎన్నికల్లో మంత్రి డిఎల్ కి డిపాజిట్ దక్కలేదని బ్రహ్మసాగర్ నుంచి రావలసిన నీటిని అడ్డుకున్నారు. రబీ సీజన్ లో 32 లక్షల ఎకరాలు సాగు చేయవలసి ఉండగా, 17 లక్షల ఎకరాలలోనే సాగు చేసినట్లు ఆయన వివరించారు.
Share this article :

0 comments: