నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Written By news on Thursday, October 17, 2013 | 10/17/2013

నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం గురువారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలవనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నట్టు పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.

రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ నోట్‌కు ఆమోదముద్ర పడకముందే రాష్ట్ర అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్యంకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇదివరకు గవర్నర్‌కు ఒక వినతిపత్రం అందజేయడం తెలిసిందే. అయితే తెలంగాణ అంశంపై అసెంబ్లీ తీర్మానం కోరడం లేదన్న విషయం రూఢి అయిపోయి కేవలం అభిప్రాయానికి మాత్రమే బిల్లును పంపుతారని తేలిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయడానికిగాను ఇప్పటికైనా శాసనసభను వెంటనే సమావేశపరచాలని గవర్నర్‌ను కోరనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Share this article :

0 comments: