జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్

జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్

Written By news on Wednesday, July 22, 2015 | 7/22/2015


'జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్'
న్యూఢిల్లీ: కడప జిల్లా కలెక్టర్ జిలా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులెవ్వరినీ ఏ కార్యక్రమానికీ పిలవడంలేదని అన్నారు.

ఎంపీ ల్యాడ్స్ నిధులను విడుదల చేయకుండా కలెక్టర్ ఆపేస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేసి కడపకు 44 వేల క్యూసెక్కుల నీరు అందించారని చెప్పారు. అయితే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా మంత్రి దేవినేని ఉమ అడ్డుపడుతున్నారని విమర్శించారు. గాలేరు. నగరి పనులు తక్షణమే పూర్తి చేయాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రాయితీలు ఇచ్చేలా పార్లమెంట్ లో పోరాడుతామని చెప్పారు.
 
Share this article :

0 comments: