చీకట్లో చేతులు కలిపి లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును మించినవారు ఎవరూ లేరని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ తెలంగాణభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గత మూడేళ్లుగా కాంగ్రెస్తో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కాపాడటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘ఎఫ్డీఐలకు అనుకూలంగా రాజ్యసభలో ఓటేస్తామంటూ చంద్రబాబే స్వయంగా చిదంబరంతో ఫోనులో మాట్లాడిండు. చంద్రబాబుకున్న పరపతి, పరిచయంతో పాదయాత్రలో ఉన్నపుడే చిదంబరంతో 40 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడింది నిజంకాదా?’ అని ఈటెల ప్రశ్నించారు. కొద్దికాలం కిత్రం జరిగిన ఉప ఎన్నికల్లోనూ మూడు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలు సహకరించుకు న్నాయని చెప్పారు. నర్సాపురంలో టీడీపీ అభ్యర్థికి ఓట్లేస్తే రామచంద్రాపురంలో కాంగ్రెస్కు టీడీపీవారు ఓట్లేశారని తెలిపారు. కడపలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు.
Home »
» బాబూ.. చిదంబరంతో మాట్లాడలేదా: ఈటెల
బాబూ.. చిదంబరంతో మాట్లాడలేదా: ఈటెల
Written By news on Friday, December 21, 2012 | 12/21/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment