నిజామాబాద్: గురువారం నుంచి రెండు రోజులు నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో 19 మంది తనువు చాలించారు. వీరిలో మొదటి విడత పరామర్శ యాత్రలో 12 కుటుంబాలను కలిశారు. రెండో విడతలో భాగంగా గురు, శుక్రవారాల్లో మిగిలిన ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. మొదటిరోజు నాలుగు, మరుసటి రోజు మూడు కుటుంబాలను కలుసుకుంటారు. వైఎస్ కోసం అసువులు బాసిన వారి స్మారకార్థం గాంధారి మండలం పోతంగల్ కలాన్ సమీపంలో శుక్రవారం పైలాన్ను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Home »
» రెండు రోజులు నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
రెండు రోజులు నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
Written By news on Thursday, January 7, 2016 | 1/07/2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment