వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు

వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు

Written By news on Friday, August 16, 2013 | 8/16/2013

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో  చిత్తూరుకు చెందిన పలువురు కాంగ్రెస్‌, టీడీపీ మాజీ కౌన్సిలర్‌లు, స్థానిక నేతలు శుక్రవారం పార్టీలో చేరారు.  దాదాపు 100 మంది స్థానిక నేతలు పార్టీలో చేరారు. వీరంతా బీసీల్లో వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు.
జిల్లాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పటికీ తమ కులానికి ఇప్పటివరకు రాజకీయ ప్రాధాన్యం లేకపోవడంతో వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ కచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుందని విజయమ్మ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

Share this article :

0 comments: