రాష్ట్ర విభజనపై ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర విభజనపై ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

రాష్ట్ర విభజనపై ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

Written By news on Wednesday, August 14, 2013 | 8/14/2013

రాష్ట్ర విభజనపై ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు, ప్రజా ప్రతినిధులంతా ఎందుకు తమ పదవులకు రాజీనామా చేయాల్సివచ్చిందో శ్రీమతి విజయమ్మ ఒక లేఖ ద్వారా ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్‌కు తెలియజేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా నిర్ణయం తీసుకోని పక్షంలో కేంద్రంలో పాలకులు రాజ్యాంగ ద్వారా రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ధర్మం కాదని, రాష్ట్రాన్ని యధావిధిగా కొనసాగించటమే ధర్మమని అన్నారు.
 
 రాష్ర్టంలో ఉన్న మూడు పార్టీలు-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సీపీఐ(ఎం) ఈ మూడూ ఒకే మాట చెబుతున్నాయని, న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడగొట్టవద్దు. యథావిధిగా కలిపే ఉంచండి..అంటున్నాయని వివరించారు. ఒకవైపు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నప్పుడు, బంద్‌లు జరుగుతున్నప్పుడు..వంద శాతం ఏకాభ్రిప్రాయం రాజకీయ పార్టీలన్నింటి మధ్య సాధించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పగలుతోందని ప్రశ్నించారు.
 
 రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకున్నది-తెలుగుదేశం పార్టీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బిజేపీ ఈ ఐదు పార్టీలు మాత్రమేనని, ఓట్ల కోసం, సీట్ల కోసం అధికార పార్టీ అన్యాయం చేస్తుంటే..ఓట్లు పోతాయని , సీట్లు పోతాయని,తనకు రావాల్సిన క్రెడిట్ పోతుందని ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు విభజన ద్వారా జరిగిన అన్యాయాన్ని గురించి స్పందించకుండా ఉంటే , ఇక ఈ రాష్ట్రం తరుపువారు ఇక్కడివారి గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.
 
 ‘‘ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందంటే..నెత్తిన  తుపాకీ పెట్టి ఒప్పుకుంటారా? చస్తారా అని అడిగినట్లు ఉందన్నారు.  ఒకవేళ అంగీకరించకపోయినా, మా ఇష్టం ప్రకారం చెయ్యాల్సింది చేస్తాం ..అన్నట్టు ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది..అని కాంగ్రెస్ వారు చెప్పటం తప్పుదారి పట్టించటం కదా? ఇలా ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నవారు చెబుతున్నారో? ఇన్ని కోట్ల మంది రాష్ట్రాన్ని విడగొట్టదని చెబుతున్నా..వీరందరి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?’’ అని ప్రశ్నించారు.
 
 తమ రాజీనామా సందర్భంలో మేము విడుదల చేసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని,దాన్ని చదివి ఇక్కడి సమస్యల్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండని కోరారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే, తమకు అధికార బలం ఉంది కదా అని నిర్ణయం తీసుకుంటే..రాష్ట్రం మనిషి చేసిన ఎడారిగా మారుతోందని హెచ్చరించారు. అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని తరతరాలు దోషిగా భావిస్తాయన్నారు.
Share this article :

0 comments: