- బాబుపై వైఎస్సార్సీపీ వాసిరెడ్డి పద్మ ధ్వజం
విద్యుత్ చార్జీలు పెంచాలనే ఆలోచనను మానుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజాందోళన చేపడతామని హెచ్చరించారు. 2013 ఏప్రిల్ 2న చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో కాకినాడ సభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరే కించారని ఆమె గుర్తుచేశారు.
తాను అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు అసలు పెంచనని, కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన చార్జీలను కూడా తగ్గిస్తానని ఆ రోజున ప్రకటించిన చంద్రబాబు ఈరోజు ప్రజలపై భారం మోపడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘‘పెంచిన చార్జీలను బేషరతుగా తగ్గించాలని, లేకుంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలని కూడా చంద్రబాబు ఆరోజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి వైదొలగకపోతే ప్రజలు తిరగబడాలని కూడా పిలుపునిచ్చారు. ఆరోజు ప్రజలకు భారం అనిపించిన విద్యుత్ చార్జీలు ఈరోజు భారంగా బాబుకు అనిపించడం లేదా ?’’ అని ఆమె ప్రశ్నించారు.
ఉద్యమించిన వారిని పొట్టన పెట్టుకున్న చరిత్ర మీది...
చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలోనూ ఏటా కరెంటు చార్జీలు పెంచడమేగాక అందుకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపి పొట్టన బెట్టుకున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఏనాడూ విద్యుత్ చార్జీలు, పన్నులు, ఆర్టీసీ చార్జీలు పెంచలేదని, ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ సీఎంలు, చంద్రబాబు చార్జీలు పెంచుతున్నారని తెలిపారు.
0 comments:
Post a Comment