జగన్ దీక్షకు నార్వే మాజీ మంత్రి సంఘీభావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ దీక్షకు నార్వే మాజీ మంత్రి సంఘీభావం

జగన్ దీక్షకు నార్వే మాజీ మంత్రి సంఘీభావం

Written By news on Sunday, February 1, 2015 | 2/01/2015

తణుకు టౌన్ : తణుకులో రైతు దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నార్వే దే శానికి చెందిన మాజీ మేజిస్ట్రేట్ (మాజీ మంత్రి) స్వోలాఫ్రిడ్ స్వీసన్, మరో ముగ్గురు సభ్యుల బృందం కలిసి ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. సేవా కార్యక్రమాల నిమిత్తం రాజమండ్రి వెళుతున్న నార్వే బృందం మార్గమధ్యంలో తణుకులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్న విషయం తెలుసుకుని శిబిరం వద్దకు వెళ్లి ఆయనను కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్వీడన్ మాజీ మంత్రి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ తనకు ఎంతో సన్నిహితుడుని, ఆయనతో అనుబంధం మరువలేనిదన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడానికి నిరసనగా ప్రభుత్వం తీరుపై జగన్‌మోహన్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రుణమాఫీని అమలు చేసి రైతులకు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేకూర్చాలని ఆమె పేర్కొన్నారు. ఈ బృందంలో నార్వేకు చెందిన రిటైర్డ్ టీచర్ కాలీజీ స్త్విక్, ఓఎన్‌జీ ఇంజనీర్ హరాల్డ్, ఆయిల్ కంపెనీ మేనేజర్ గున్నార్ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: