‘‘ఏంది బిడ్డా... తిండి తిప్పలు మాని దీక్షలు జేస్తున్నవు. ఆరోగ్యం ఆగమైంది బిడ్డా. నిన్ను అట్లా టీవీల జూస్తంటే మా పానం కొట్కలాడుద్ది. నాయిన ఉంటే నీకూ, మాకు ఈ కష్టాలు వచ్చేటియే కావు. చంద్రబాబు దొంగే జనాన్ని ఆగం జేస్తండు. ఆయన సంగతి దేవుడే జూసుకుంటడుగని నువ్వు దీక్షల మీద దీక్షలు చేయకు బిడ్డా..’’ అని వరంగల్ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లికి చెందిన వృద్ధురాలు నర్సమ్మ జగన్కు చెప్పింది. శాయంపేట మీదుగా కొప్పుల వైపు వస్తుండగా జోగంపల్లి శివారులోని పత్తి తోటల్లో పత్తి ఏరుతున్న మహిళలను జగన్ పలకరించారు. ఈ సందర్భంగా వారంతా వైఎస్సార్ ఉపాధి పని చూపెట్టాకే ఊళ్లలో రూ.100 కూలీ ఇస్తున్నారని చెప్పారు.
వైఎస్సార్ వేసిన దారిలో ఇప్పటి నాయకులు మెరిగలు ఏరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ‘‘వైఎస్సార్ మాటంటే మాటే.. రుణ మాఫీ చేస్తే మళ్లీ సూడకుండా మాఫీ అయినయి. కేసీఆర్ రుణ మాఫీ అన్నడుగాని బ్యాంకోళ్లతోటి తిప్పలు తప్పుతలెవ్వు. వడ్డీలు కట్టించుకుంటున్నరు..’’ అని సువర్ణ అనే మహిళ జగన్కు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్ వేసిన దారిలో ఇప్పటి నాయకులు మెరిగలు ఏరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ‘‘వైఎస్సార్ మాటంటే మాటే.. రుణ మాఫీ చేస్తే మళ్లీ సూడకుండా మాఫీ అయినయి. కేసీఆర్ రుణ మాఫీ అన్నడుగాని బ్యాంకోళ్లతోటి తిప్పలు తప్పుతలెవ్వు. వడ్డీలు కట్టించుకుంటున్నరు..’’ అని సువర్ణ అనే మహిళ జగన్కు ఫిర్యాదు చేశారు.
0 comments:
Post a Comment