వైఎస్ఆర్ సీఎల్పీని ప్రకటించిన విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీఎల్పీని ప్రకటించిన విజయమ్మ

వైఎస్ఆర్ సీఎల్పీని ప్రకటించిన విజయమ్మ

Written By news on Friday, July 6, 2012 | 7/06/2012

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) కమిటీని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రకటించారు. వైఎస్‌ విజయమ్మ గతంలోనే ఫ్లోర్‌ లీడర్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. డిప్యూటీ లీడర్లుగా ధర్మాన కృష్ణదాస్‌, మేకతోటి సుచరిత, శోభానాగిరెడ్డిలు వ్యవహరించనున్నారు. 

కార్యదర్శులుగా తెల్లం బాలరాజు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కో ఆర్డినేటర్‌గా జి.శ్రీకాంత్‌రెడ్డి... విప్‌గా బాలినేని శ్రీనివాసరెడ్డిలను నియమించారు. ఎగ్జిక్యూటివ్‌ బాడీ కార్యవర్గ సభ్యులుగా గొర్ల బాబూరావు, గుర్నాథ్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహరిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ ప్రకటించారు.
Share this article :

0 comments: