విజయవాడ: మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్పై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. 406, 420, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. చెల్లింపులు జరిపినప్పటికీ ఆస్తి పత్రాలు ఇవ్వకుండా మోసం చేశారని వేమూరి హషిత కోర్టును ఆశ్రయించింది. హషిత ఆరోపణలపై స్పందించిన కోర్టు శైలజ కిరణ్ పై కేసు నమోదు చేయాలని తెలిపింది. ఈ మేరకు మాచవరం పోలీసులకు కోర్టు ఆదేశాలు పంపింది.
Home »
» మార్గదర్శి ఎండీపై చీటింగ్ కేసు!
మార్గదర్శి ఎండీపై చీటింగ్ కేసు!
Written By news on Friday, July 6, 2012 | 7/06/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment