Home »
» 2007లోనే విభజనను వైఎస్ అడ్డుకున్నారు: భవానీ ప్రసాద్
2007లోనే విభజనను వైఎస్ అడ్డుకున్నారు: భవానీ ప్రసాద్
గుంటూరు, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ను విభజించాలనుకున్న సోనియాగాంధీ ప్రయత్నాలను దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007లోనే అడ్డుకున్నారని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అక్కినేని భవానీప్రసాద్ చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్సింగ్కు తేల్చిచెప్పిన వైఎస్ తుదిశ్వాస వరకూ రాష్ట్రం విడిపోకుండా కృషిచేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం గుంటూరులో నిర్వహించిన సమైక్యవాదుల ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.
0 comments:
Post a Comment