నిరాహార దీక్ష చేస్తుండటంతో నిన్నే జగన్ బాగా నీరసంగా కనిపించారు. అయినప్పటికీ తనను కలిసేందుకు వచ్చిన వారిని అదే చిరునవ్వుతో పలుకరిస్తూ అభివాదం చేశారు. వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, పిల్లలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరితో నిలబడి ఎంతో ఓపిగ్గా మాట్లాడారు.
మరోవైపు జగన్ ఆమరణ దీక్షకు మద్దతగా దీక్షా శిబిరం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలియజేస్తున్నారు. జగన్ దీక్షకు గ్రేటర్ హైదరాబాద్ పాస్టర్స్ మద్దతు ప్రకటించారు. జగన్ చేపట్టిన దీక్ష విజయవంతం కావాలంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
0 comments:
Post a Comment