వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డ్డి ఎన్నికల ప్రచారం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పాకాల మం డలం దామలచెరువు పంచాయతీ బం దార్లపల్లె నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు అ డుగడుగునా పూలుచల్లుతూ ఘన స్వా గతం పలికారు. మహిళలు కర్పూర నీ రాజనాలు పలికారు. వందలాది మంది యువకులు, మహిళలు జైజగన్, జై చెవిరెడ్డి నినాదాలతో హోరెత్తించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ సీపీని బలపరచాలని చెవిరెడ్డి కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమ కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అఖం డ మెజారిటీతో గెలిపిస్తామని హమీ ఇ చ్చారు. బందార్లపల్ల్లె, హరిజన వాడ ప్రాంతాల్లో చెవిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలి
ప్రచారంలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవస రం ఉందని తెలిపారు. వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని కోరారు. సమస్యలపై స్పందించేది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనని చెప్పారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ ని యోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాకాల మండల కన్వీనర్ చెన్నకేశవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెం బర్ సంగా బాబురెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ దామినేటి కేశవులు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ చొక్కారెడ్డి జగదీశ్వర్రెడ్డి, మల్లారపు శ్రీరాములు, గోవిందరెడ్డి, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, హరినాథ రెడ్డి, చిన్నబ్బరెడ్డి, రాజారెడ్డి, సుబ్బారెడ్డి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకాల మండలంలో వంద మందికి పైగా యువకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సమక్షంలో వైఎ స్సార్ సీపీలో చేరారు. రిటైర్డ్ టీచర్, ప్రముఖ వ్యాపారవేత్త ప్రభాకర్రెడ్డి పా ర్టీలో చేరిన వారిలో ఉన్నారు.
జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలి
ప్రచారంలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవస రం ఉందని తెలిపారు. వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని కోరారు. సమస్యలపై స్పందించేది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనని చెప్పారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ ని యోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాకాల మండల కన్వీనర్ చెన్నకేశవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెం బర్ సంగా బాబురెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ దామినేటి కేశవులు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ చొక్కారెడ్డి జగదీశ్వర్రెడ్డి, మల్లారపు శ్రీరాములు, గోవిందరెడ్డి, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, హరినాథ రెడ్డి, చిన్నబ్బరెడ్డి, రాజారెడ్డి, సుబ్బారెడ్డి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకాల మండలంలో వంద మందికి పైగా యువకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సమక్షంలో వైఎ స్సార్ సీపీలో చేరారు. రిటైర్డ్ టీచర్, ప్రముఖ వ్యాపారవేత్త ప్రభాకర్రెడ్డి పా ర్టీలో చేరిన వారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment