Home »
» పట్టిసీమకు బయల్దేరి వెళ్లిన వైఎస్ జగన్
పట్టిసీమకు బయల్దేరి వెళ్లిన వైఎస్ జగన్
రాజమండ్రి : కాటన్ బ్యారేజి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభమైంది. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి ప్రాంతానికి చేరుకున్నారు.(ప్రాజెక్టుల యాత్ర ప్రారంభం)అక్కడ ఆయన సర్ ఆర్థర్ కాటన్, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి పట్టిసీమ ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు బస్సు యాత్రలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పలువురు ఉన్నారు.
0 comments:
Post a Comment