వైఎస్ రాజారెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ రాజారెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్

వైఎస్ రాజారెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్

Written By news on Saturday, May 23, 2015 | 5/23/2015


వైఎస్ రాజారెడ్డికి  నివాళులర్పించిన వైఎస్ జగన్
పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పులివెందులలో తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరిన ఆయన శనివారం తెల్లవారుజామున ముద్దనూరుకు.. అక్కడ నుంచి పులివెందులకు చేరుకున్నారు.

వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం 8.30గంటలకు తాత వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్దకు చేరుకున్నారు.  వైఎస్ రాజారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,  వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డిలు కూడా వైఎస్ రాజారెడ్డి సమాది వద్ద నివాళులర్పించారు.


Share this article :

0 comments: