సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి మంగళవారం ట్వీటర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘అనంతపురం జిల్లాలో నెలకొన్న క్షేత్రస్థాయి వాస్తవాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. చంద్రబాబునాయుడు చెప్పిన అబద్ధాలు.. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ఆ వర్గాల గొంతుకగా నిలవడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది.’ అని జగన్ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా స్పందించారు. జగన్ ఇటీవలే అనంతపురం జిల్లాలో రెండు విడతలుగా రైతు భరోసా యాత్ర సాగించి ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment