తిరుపతి:గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలం చెందారని వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. చంద్రబాబు హామీల అమలు కోసమే వచ్చే నెల 3.4 తేదీల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ తలపెడుతున్న దీక్షను కొందరు మంత్రులు తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు. మంత్రులకు దమ్ముండే చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి హామీలు నెరవేర్చాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
వైఎస్ జగన్ తలపెడుతున్న దీక్షను కొందరు మంత్రులు తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు. మంత్రులకు దమ్ముండే చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి హామీలు నెరవేర్చాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
0 comments:
Post a Comment