పార్టీలో చేరికలు, రచ్చబండ కార్యక్రమం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తాము హాజరు కాలేకపోయామని భూమా నాగిరెడ్డి తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము కృషి చేస్తామన్నారు. చివరి వరకూ జగన్ అడుగు జాడల్లోనే నడుస్తామని భూమా దంపతులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు చేతనైతే వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఆ రెండు పార్టీల నేతలే తమపై ఏబీఎన్ ఛానల్ లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ కుటుంబంపై అభిమానంతో పార్టీలో కొనసాగుతున్నామని శోభా నాగిరెడ్డి తెలిపారు
0 comments:
Post a Comment