కోల్ కతా చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోల్ కతా చేరుకున్న వైఎస్ జగన్

కోల్ కతా చేరుకున్న వైఎస్ జగన్

Written By news on Wednesday, November 20, 2013 | 11/20/2013

కోల్ కతా చేరుకున్న వైఎస్ జగన్
కోల్‌కతా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోల్ కతా చేరుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన ఈరోజు మధ్యాహ్నం భేటీ కానున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించే దిశగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులు సడలించాలని జగన్ కోర్టును కోరారు. ఆ మేరకు ముందుగా కోల్ కతా, లక్నో నగరాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.

దీంతో ముందుగా ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా గూర్ఖాలాండ్ ఉద్యమం జోరుగా ఉండటం, విభజన యోచనను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. ఆంద్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కూడా ఆమె మద్దతు పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కోల్ కతా వెళ్లిన జగన్ మోహన్ రెడ్డికి కోల్ కతా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మమతతో సమావేశం కానున్నారు.
Share this article :

0 comments: