సీమాంధ్రలో పలు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. సీమాంధ్రలోని 25 లోక్ సభ, 175 శాసనసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు.
వైఎస్ఆర్ జిల్లా రాజంపేట శాసనసభ స్థానానికి వైఎఎస్ఆర్ సిపి అభ్యర్థిగా అమర్నాథరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో అభ్యర్థి భూమన కరుణాకర్రెడ్డి తరఫున ఆయన తనయుడు అభినయరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీకి వైఎస్ఆర్ సీపీ తరఫున కోట్ల హరిచక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లూరు సిటీ అసెంబ్లీ వైఎస్ఆస్ సిపి అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, కాకాని, మేరగ మురళీధర్ తదితరులు హాజరయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి దొరబాబు నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోట గోపి నామినేషన్ వేశారు. ఉండి అసెంబ్లీ స్థానానికి పాతపాటి సర్రాజు నామినేషన్ దాఖలు చేశారు.
వైఎస్ఆర్ జిల్లా రాజంపేట శాసనసభ స్థానానికి వైఎఎస్ఆర్ సిపి అభ్యర్థిగా అమర్నాథరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో అభ్యర్థి భూమన కరుణాకర్రెడ్డి తరఫున ఆయన తనయుడు అభినయరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీకి వైఎస్ఆర్ సీపీ తరఫున కోట్ల హరిచక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లూరు సిటీ అసెంబ్లీ వైఎస్ఆస్ సిపి అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, కాకాని, మేరగ మురళీధర్ తదితరులు హాజరయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి దొరబాబు నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోట గోపి నామినేషన్ వేశారు. ఉండి అసెంబ్లీ స్థానానికి పాతపాటి సర్రాజు నామినేషన్ దాఖలు చేశారు.
0 comments:
Post a Comment