పార్టీ వరంగల్ జిల్లా కన్వీనర్ ముత్తినేని సోమేశ్వర్రావు, రాము తదితరులు వెంకట్రావును కలిసి సంఘీభావం తెలిపారు. వెంకట్రావు, పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లు, ముత్తినేని సోమేశ్వర్రావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జేసీ పౌసుమిబసుకు అందజేశారు.
ఐదు అసెంబ్లీ స్థానాలు మావే..
ఖమ్మం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని సోమేశ్వర్రావును ఆయన కోరారు. వెంకట్రావు వెంట ఖమ్మం జిల్లా నేతలు ఉడుముల లక్ష్మారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వట్టం రాంబాబు, పోలెబోయిన తిరుపతిరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు
0 comments:
Post a Comment