నాడు తాతయ్యతో.. నేడు మామయ్యతో.. లక్కీగర్ల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు తాతయ్యతో.. నేడు మామయ్యతో.. లక్కీగర్ల్

నాడు తాతయ్యతో.. నేడు మామయ్యతో.. లక్కీగర్ల్

Written By news on Saturday, April 12, 2014 | 4/12/2014

నాడు తాతయ్యతో.. నేడు మామయ్యతో.. లక్కీగర్ల్వీడియోకి క్లిక్ చేయండి
కుందన సాయి.. ఈ పేరు చెబితే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల గుండె ఉప్పొంగుతుంది. ఆమె ఎవరో కాదు.. 2004, 2009 ఎన్నికలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెన్నంటే ఉండి, ఆయనకు అదృష్టాన్ని పంచిచ్చిన బంగారు తల్లి. వైఎస్ఆర్ ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా ఆయన వెంట కుందన సాయి తప్పకుండా ఉండేది. చేవెళ్ల, నందికొట్కూరులో ప్రారంభ, ముగింపు సభలలో వైఎస్ వెంట ఆమె కూడా ప్రచార సభల్లో పాల్గొంది. రెండు ఎన్నికలలోను వైఎస్ఆర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆమెను ప్రేమగా 'లక్కీ గర్ల్' అని పిలుచుకునేవారు.

ఇప్పుడు ఐదేళ్లు గడిచాయి... ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో ఆయన వెంట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ చిన్నారి తల్లి సిద్ధమైంది. శనివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కుందనసాయి.. చాలా ఉద్వేగంగా ఆయనతో మాట్లాడింది. వైఎస్ఆర్ ఇప్పుడు లేరు కాబట్టి, తాను జగన్ వెంట ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటానని, అందుకు అవకాశం ఇప్పించాలని కోరింది. ''నేను తాతయ్య వెంట 2004, 2009 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నాను. తాతయ్య నన్ను 'లక్కీ గర్ల్' అనేవారు. ఇప్పుడు జగన్ మామయ్య కోసం ప్రచారం చేస్తాను. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను'' అని కుందనసాయి తెలిపింది.
Share this article :

0 comments: