ఖమ్మం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణపై వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నారాయణ వలస పక్షిలా ఖమ్మం వచ్చి పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గెలుపు కోసం దోపిడీ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో తనదే విజయమని పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు.
రానున్నది రాజ్యమని అన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సువర్ణయుగం సాధ్యమవుతుందని పొంగులేటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
రానున్నది రాజ్యమని అన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సువర్ణయుగం సాధ్యమవుతుందని పొంగులేటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
0 comments:
Post a Comment