వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యం

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యం

Written By news on Saturday, October 18, 2014 | 10/18/2014


అనంతపురం:మరోసారి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యానికి పాల్పడింది.  జిల్లాలోని తాడిపత్రి మండలం వీరాపురంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పూనుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్న కారణంగానే టీడీపీ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన టీడీపీ మరోమారు అదే దౌర్జన్యానికి ఒడిగట్టింది.
Share this article :

0 comments: