వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం

Written By news on Thursday, October 16, 2014 | 10/16/2014

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు వచ్చారు. ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు వారీ నిర్ణయం తీసుకున్నారు.

హుదూద్ తుపాను బాధితులకు సహాయం అందించేందుకు వైఎస్సార్ ఫౌండేషన్, ‘సాక్షి’ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తొలి విరాళాన్ని ప్రకటించారు. తన వంతుగా ఆయన రూ. 50 లక్షల విరాళాన్ని బుధవారం ప్రకటించారు.
Share this article :

0 comments: